తెలుగు హీరోలతో సినిమాపై స్పందించిన వెట్రిమారాన్..!!

Divya
కోలీవుడ్ డైరెక్టర్ వెట్రీ మారన్ దర్శకత్వం చేసిన తాజా చిత్రం విడుతలై పార్ట్ -1 మార్చి 31వ తేదీన విడుదలై పాజిటివ్ టాకుతో దూసుకుపోతోంది.. కమెడియన్ సూరిని హీరోగా ఈ చిత్రంతో పరిచయం చేశారు.. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ వంటి నటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం జరిగింది. క్రైమ్ త్రిల్లర్ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా ఏప్రిల్ 15వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెట్రిమారన్ ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

విడుతలై-1 నీ తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ ఏప్రిల్ 15న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. డైరెక్టర్ వెట్రిమరాన్ తెలుగు హీరోలతో సినిమాల గురించి మాట్లాడడం జరిగింది.. వెట్రిమారన్ మాట్లాడుతూ ఆడుకాలం తర్వాత అల్లు అర్జున్ రెండుసార్లు కలిశాను అప్పుడు వడ చెన్నైలో పవర్ ఫుల్ రోల్ గురించి చెప్పాను కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ నుండి రొల్  తీసేవలసి వచ్చిందని దీంతో అల్లు అర్జున్తో సినిమా చేయలేకపోయానని తెలిపారు. దాంతో అల్లు అర్జున్ తో సినిమా చేయలేకపోయానని తెలిపారు. ఆ తర్వాత మహేష్ బాబును కూడా కలిశాను కానీ ఆయనతో కూడా సినిమా వర్కౌట్ కాలేదని తెలిపారు.

లాక్ డౌన్ తర్వాత ఎన్టీఆర్ను కలవడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే ఈ సినిమా చేయడానికి మాత్రం చాలా సమయం పట్టవచ్చు అంటూ వెట్రిమారన్ తెలిపారు. గత కొంతకాలంగా ఎన్టీఆర్ వెర్రిమారని కలిసి సినిమా చేయాలనుకున్నారని వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి.. తాజాగా వెట్రి మారన్ స్టార్ హీరోలతో సినిమాలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్టీఆర్ తోనైనా ఈసారి కచ్చితంగా సినిమాలు ఎక్కిస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఎన్టీఆర్ -30, వార్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: