ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన రకుల్..!!

Divya
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ డబ్బులు సంపాదించడానికి పలు రకాలుగా బిజినెస్లను, పలు రకాల వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఏ ఇండస్ట్రీలో నైనా నటీనటులు చేయడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.. కానీ ఈ మధ్యకాలంలో ఎలాంటి వాటినైనా సరే సమర్థిస్తూ డబ్బులు సంపాదించడానికి కొంతమంది నటీనటులు సైతం పలు రకాలుగా యాప్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలా ట్రోలింగ్కు కూడా గురైన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఇప్పుడు ఈమె గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ఈ  మధ్యకాలంలో తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కాలేదు. బాలీవుడ్లో మాత్రం గత ఏడాది ఒకేసారి ఐదు సినిమాలు విడుదల చేసినప్పటికీ ఫ్లాప్ గా మిగిలాయి.. దీంతో పలు దుస్తులకు, పలు రకాల ఆల్కహాల్ వంటి వాటి దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు తాజాగా రమ్మీ అనే గేమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రొమోట్ చేస్తోంది ఈ అమ్మడు. దీంతో ఈ ఆమ్మడి పైన పలు రకాలుగా నేటిజన్లు ట్విట్టర్లో ట్రోల్ చేయడం జరిగింది.

ఇలాంటి వాటిని సహకరిస్తే ఎలా మిమ్మల్ని చూసి చాలామంది ప్రజలు కూడా చెడిపోతారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడమే కాకుండా ట్రోల్ చేయడంతో.. వీటికి సమాధానంగా రకుల్ రమ్మీ ఆడడం అసలు తప్పు కాదని ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు తనకు ఎలాంటి సిగ్గు లేదని కూడా తెలియజేస్తోంది.. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో నేటిజనుల ద్వారా నటీనటులు సైతం పలు రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: