ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 4 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో మూవీ లు విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.
వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ... రవితేజ భార్య పాత్రలో ఈ సినిమాలో క్యాథరిన్ నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 236.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
వీర సింహా రెడ్డి : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
సార్ : ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 120.83 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు మరియు తమల బాషలో విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వాతి పేరుతో విడుదల అయింది.
దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: