ఎన్టీఆర్ కొత్త సినిమాలో సరికొత్త ట్విస్ట్...!!

murali krishna
జూనియర్ ఎన్టీఆర్ హడావుడిగా కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. వార్2 లో ఎన్టీఆర్ నటిస్తుండటం తో ఆనందించాలో , షాకవ్వాలో ఫ్యాన్స్ కు అస్సలు అర్థం కావడం లేదు.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయ ని ప్రభాస్ స్థానం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరారని సమాచారం.వార్ ఫస్ట్ పార్ట్ కు సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు కాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే..
మరోవైపు కొన్నిరోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో ఒక సినిమాను ప్లాన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ సినిమాను మైత్రీ నిర్మాతలు హృతిక్ ప్రభాస్ కాంబోలో వార్2 గా తెరకెక్కించాలని అనుకున్నారని తెలుస్తుంది.. అయితే వార్ సినిమాను నిర్మించింది యశ్ రాజ్ బ్యానర్ నిర్మాతలు కావడంతో సిద్దార్థ్ ఆనంద్ మరో బ్యానర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యశ్ రాజ్ బ్యానర్ నిర్మాతలు వార్2 ను ప్రకటించారని సమాచారం.
మైత్రీ నిర్మాతలు ప్రభాస్ ను ఎంపిక చేయాలని భావించిన రోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చి చేరారని తెలుస్తుంది.. అయితే మరో ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ మైత్రీ నిర్మాతల మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు కూడా నిర్మాతలు మైత్రీ నిర్మాతలు కావడం విశేషం..
వార్2 ప్రాజెక్ట్ ప్రకటనతో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తుంది.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎవరో ఒకరు పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తే బాగుంటుందని తెలుస్తుంది.వార్2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం మాత్రం గ్యారంటీ గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: