ఈ ఫొటోలో ఉన్నా టాలీవుడ్ స్టార్ హీరోస్ గుర్తుపట్ట గలరా....!!

murali krishna
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్న సీనియర్ అలానే జూనియర్ హీరో,హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి గురించి తెలుసుకోవటానికి అభిమానులు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు.
వారి గురించి ఏ చిన్న విషయం తెలిసిన చాలా ఆనందపడతారు. ఇక విషయానికి వస్తే ఈ ఫోటోలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు.
 
వారిని గుర్తు పట్టారా.ఒక్కసారి ఫోటో చూస్తే మీకే అర్ధం అవుతుంది. అర్ధం కాకపోతే ఆ హీరోలు ఎవరో చూద్దాం. ఈ ముగ్గురు హీరోలు కలిసి చదువుకోవటమే కాకుండా మంచి స్నేహితులు. ఆ ముగ్గురు ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రానా దగ్గుబాటి.. అల్లు శిరీష్.
వీరి ముగ్గురు చిన్నప్పుడు ఒకే స్కూల్. ఆ ఫోటోలో రానా, చరణ్ ముందు లైన్లో నిలబడి ఉండగా అల్లు శిరీష్ మాత్రం చివరి లైన్లో నిల్చున్నారు. రానాకు, చరణ్ కి మధ్య మరో ముగ్గురు ఉన్నారు. రామ్ చరణ్ rrr సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
 
ఇక రానా తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని వైవిధ్యమైన పాత్రలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అల్లు శిరీష్ మాత్రం ఇంకా సెటిల్ అయ్యే క్రమంలో సినిమాలు చేస్తున్నాడు. అల్లు శిరీష్.. ఇటీవలే ఊర్వశివో.. రాక్షసివో సినిమా చేసాడు.

ఐతే బాహుబలి తర్వాత  రానా రేంజ్ మారిపోయింది అని చెప్పవచ్చు. అలాగే అయనకు మంచిమాంచి సినిమాల్లో ఛాన్సెస్ వస్తున్నాయి. కాకపోతే ఇటీవల ఆయన చేసిన వెబ్ సిరీస్ కింమాత్రం అనూహ్యంగా నెగటివ్ రెస్పాన్స్ రావడంతో ఇకపై వెబ్ సిరీస్ చేసే ఆలోచన లేదంటూ ఆయన అన్నారని సోషల్ మీడియా లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే రామ్ చరణ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన ఇటీవల ఆస్కార్ అవార్డు సాధించి గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ప్రెసెంట్ ఆయన శంకర్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు.

చివరగా అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీ లో కొంచం వెనుక పడిపోయాడు అని చెప్పవచ్చు. సినిమాల్లో అంత గుర్తింపు రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: