SSMB28: అట్లుంటది బాబు రేంజ్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ హాట్ హీరోయిన్స్ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సినిమాల స్టైల్ లోనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని సమాచారం తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. పల్నాడు బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కు రీచ్ అయ్యి అంశాలు చాలా పుష్కలంగా ఉంటాయని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ మూవీ చేయనున్నారు.ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కుతుంది.


ఈ సినిమా రిలీజ్ కావడానికి కనీసం రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. అందుకే ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాతో ఖచ్చితంగా సాలిడ్ హిట్ కొట్టాలని సూపర్ స్టార్ మహేష్ బాబు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన అతడు,  ఖలేజా సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని పోస్టర్ తోనే క్లారిటీ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా చాలా పుష్కలంగా ఉండే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథని సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్ముడైపోయినట్లు సమాచారం తెలుస్తుంది. అమెరికాలో ఏకంగా 15 కోట్లకు ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నారు. అంటే ఈ సినిమా ఏకంగా 5 మిలియన్ డాలర్ల టార్గెట్ తో అక్కడ రిలీజ్ అవ్వబోతుంది. ఇది నిజంగా సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ కి మరో ఉదాహరణగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: