సలార్.. బిజినెస్ లో సరికొత్త పద్ధతిలో సలార్..?

Divya
టాలీవుడ్ హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నది. ఈ సినిమా పైన అభిమానులకు మంచి హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28న ఈ సినిమా నీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా హక్కులను ఫారస్ ఫిలిమ్ దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఇదే కొనుగోలు డీల్ కాదు అలా అని డిస్ట్రిబ్యూషన్ డీలు కూడా కాదని తెలుస్తోంది.

నిర్మాత తరఫున ఓవర్సీస్ లో బిజినెస్ చేసి.. ఎప్పటికప్పుడు అమౌంటు అందించి డీల్ అన్నట్లుగా తెలుస్తోంది. దీని వల్ల ఫారెస్ ఫిలింకు కమిషన్ కూడా లభిస్తుంది. అయితే ఓవర్సీస్ థియేటర్ రైట్స్ రికార్డు దొరకే సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి కొత్త తరహా డీల్ ను ఇప్పుడు మొదటిసారిగా  సలార్ చిత్రానికి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే మాదిరిగా మైత్రి మూవీస్ నుంచి పుష్ప-2 సినిమా ను కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి డీల్స్ వల్ల పెద్దగా నిర్మాతలకు పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవట.. ముఖ్యంగా బయ్యర్ కు ముందే వారి మొత్తాలను పెట్టుబడి పెట్టే పని కూడా ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కొత్త తరహా డీల్ అందరికీ షాక్ ఇస్తోంది .ఫారస్ ఫిలిమ్ నే భారీ మొత్తంలో ఎదురు పెట్టుబడి పెట్టి మరి దాదాపుగా అన్ని చిత్రాలను తమ చేతిలోకి తీసుకుంటోంది .వీటితోపాటు రావణాసుర, ఖుషి వంటి చిత్రాలు కూడా ఈ సంస్థ కే ఓవర్సీస్ హక్కులు దక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మేరకు సలార్ చిత్రం సక్సెస్ బాట పట్టి ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి. భారీ పెట్టుబడితో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: