పవన్ ... సాయి ధరమ్ తేజ్ మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం కు అధికారిక రీమేక్ గా రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ తెలుగు వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ రీమేక్ మూవీ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో అనేక మార్పులు ... చేర్పులను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది . అందులో భాగంగా ఈ మూవీ లో సాయి తేజ్ కు ఒక హీరోయిన్ ఉండబోతున్నట్లు ... అలాగే ఈ మూవీ లో రెండు పాటలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది .

తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని 28 జూలై 2023 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: