ఆ నిర్మాణ సంస్థలో నితిన్ ... వెంకి కుడుముల సినిమా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి గుర్తింపు ను సంపాదించుకున్న అతి కొద్ది మంది దర్శకుల లో వెంకి కుడుముల ఒకరు . ఈ దర్శకుడు నాగ శౌర్య హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన ఛలో మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది .

ఛలో మూవీ తో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత నితిన్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా  భీష్మ అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా కెరియర్ లో దర్శకత్వం వహించిన రెండు మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని నితిన్ తోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నితిన్ కు వెంకీ ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన నితిన్ వెంటనే వెంకీ దర్శకత్వంలో  మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది  ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మూవీ ని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: