ఆ తేదినా "రంగమార్తాండ" విడుదల..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటు వంటి కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ వంశీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ తాజాగా రంగ మార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ... ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ బృందం చాలా స్పీడ్ గా పూర్తి చేసింది.  ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా మరాఠీ మూవీ నట సామ్రాట్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.  

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ... ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే విడుదల కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: