పవిత్ర బాగా నొక్కుతుంది.. అందుకే నరేష్ ని పెళ్లి చేసుకుంది?

praveen
సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. కానీ గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో కాస్త లేటు డేటింగ్ లో మునిగి తేలుతున్న ఒక జంట వ్యవహారమే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ జంట ఏదో కాదు నరేష్, పవిత్ర లోకేష్. నరేష్ కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరగగా.. పవిత్ర లోకేష్ కి కూడా పెళ్లయి పిల్లలు ఉన్నారు. అన్నింటినీ వదిలేసి ఇక ఇద్దరు సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే వీరి సహజీవనం గురించి ఎన్నో వార్తలు రాగా.. ఆ తర్వాత ఇక డేటింగ్ వ్యవహారాన్ని బయట పెట్టేసారు ఈ ఇద్దరు. ఇక మొన్నటికి మొన్న పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు అని చెప్పాలి.

 రీసెంట్గా పెళ్లికి సంబంధించిన వీడియో ని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక మేము భార్యాభర్తలుగా మారాము అంటూ ఒక క్లారిటీ ఇచ్చేశారు నరేష్, పవిత్ర లోకేష్. ఇక ఇప్పుడు పవిత్ర లోకేష్ కాదు పవిత్ర నరేష్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా పవిత్ర మొదట కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ చేసే సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది అని చెప్పాలి. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ భర్తతో విభేదాలు రావడంతో దూరమైంది. ఆ తర్వాత నరేష్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరికి మింగిల్ అయిపోయారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవలే పవిత్ర గురించి ఆమె మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. పవిత్ర ఒక అవకాశవాది అంటూ హాట్ కామెంట్స్ చేసాడు. నరేష్ ని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. విజయనిర్మల గారు సంపాదించిన 1500 కోట్ల ఆస్తిని తనపై రాయించుకుని నొక్కేసిందని.. అలా నొక్కడం పవిత్రకు బాగా అలవాటు అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పటినుంచో వెన్నతో పెట్టిన విద్య అని.. డబ్బు కోసం ఎలాంటి పనులు అయినా చేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సుచేంద్ర ప్రసాద్. లగ్జరీగా జీవిస్తూ జల్సాలు చేయడం పవిత్రకు ఎక్కువగా ఇష్టమంటు చెప్పుకొచ్చాడు. నా దగ్గర ఆమెకు సరిపడా డబ్బులు లేకపోవడంతోనే నరేష్ ను తగులుకుందని అతని దగ్గర డబ్బులు అయిపోగానే మరొకరి దగ్గరకు వెళుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: