"ఆర్సి 15" కోసం కియార అద్వానీ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని అయినటు వంటి కియార అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ బాలీవుడ్ సినిమాల ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. అలా హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా కియార సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇలా తెలుగు లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టింది. అలాగే బాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం విజయాలు సాధించడంతో ప్రస్తుతం కియారా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుగుకుంటుంది. ఈ మూవీ కోసం కియార భారీ మొత్తంలో రెమ్యూనికేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కోసం కియార ఏకంగా 4 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: