ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కారణం అదే..?

Divya
రాను రాను రీ రిలీజ్ ల సినిమాల హవా మళ్లీ దారుణంగా తయారవుతోంది. పాత బ్లాక్ బాస్టర్ సినిమాలను రిలీజ్ చేస్తూ థియేటర్ల దగ్గర జనాలు కనిపించడం లేదు.అలాంటిది ఫ్లాప్ సినిమాని తీసుకురావడం అంటే అదొక పెద్ద విచిత్రం అని కూడా చెప్పవచ్చు. ఆమధ్య ప్రభాస్ నటించిన రెబల్ సినిమాని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సెంటిమెంటుతో ఫాన్స్ మీద రుద్దితే ఆ ఎమోషనల్ ట్రాప్ లో పడ్డ అభిమానులు చాలా చోట్ల బాగానే ఆదరించడం జరిగింది. అయితే ఆ సినిమా ఇప్పటికిప్పుడు బ్లాక్ బస్టర్ ఏం కాలేదు. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమాగా మిగిలిపోయింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంద్రవాల సినిమా అని కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఈ నెలలోనే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులు సైతం కాస్త ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ ,యమదొంగ, టెంపర్ వంటి సినిమాలు వదిలేసి ఇలాంటి ఫ్లాప్ సినిమాలను ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ కలెక్షన్లు రాకపోతే ట్విట్టర్లో జరిగే ట్రోలింగ్ కి ఎవరు సమాధానం చెబుతారు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

2004లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఆడియో లాంచ్ ఈవెంట్ కి లక్షలాది మంది అభిమానులు స్పెషల్ ట్రైన్లు వేసి మరి తీసుకువెళ్లడం ఒక చరిత్రగా మిగిలిపోయింది.మళ్లీ అలాంటిది ఏ హీరోకు జరగలేదు. విపరీతమైన హైపో వచ్చిన ఆంద్రవాల సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో పూరి జగన్నాథ్ తో పాటు ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్ తగిలింది.రొటీన్ స్టోరీ అతిగా అనిపించే కామెడీ ట్రాక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎవరిని ఏ కోణంలో కూడా మెప్పించలేకపోయింది. కేవలం చక్రి మ్యూజిక్ డాన్సులు మాత్రమే ఇందులో కాస్త పర్వాలేదు అనిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: