ఆ మాటల పై స్పందించిన రానా.....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి సినిమాకి ముందు అంతగా పాపులర్ అవ్వనటువంటి హీరో దగ్గుబాటి రానా. ఐతే ఆయన చేసిన బాహుబలి పార్ట్ వన్ మరియు పార్ట్ టు తో ఇండియా లెవల్ లో పేరు సంపాదించాడు. అలాంటి ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయిపోయింది. రానా చివరిగా విరాట పర్వం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విరాటపర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. పైగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాలేదు. దీంతో రానా దగ్గుపాటి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది.ఐతే ఒకవైపు ఇలాంటి ప్రచారాలు వస్తూంటే ఇంకో వైపు స్టార్స్ వాటి గూర్చి క్లారిటీ ఇస్తూవస్తున్నారు.దాంట్లో భాగంగానే తాజాగా ఈ విషయంపై రానా కూడా నోరు విప్పాడు.ఐతే ప్రస్తుతం `రానా నాయుడు` వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడాయన. ఈ నేపథ్యంలోనే రానా మాట్లాడుతూ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. అయితే గ్యాప్ రావడానికి కారణం ఏంటి అనేది కూడా ఆయన వివరించారు.
ఐతే తన కెరీర్ ఆరంభంలో తనకంటూ ఒక గుర్తింపు రావడం కోసం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏ సినిమాల్లో పడితే ఆ సినిమాల్లో నటించానని, అయితే ఇప్పుడు తనకు ఇపుడు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. అందుకే విభిన్నమైన కథలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టు రానా తెలిపాడు. ప్రస్తుతం అటువంటి కథలను ఎంచుకునే పనిలో ఉన్నానని అందుకే గ్యాప్ వస్తుందని ఆయన వెల్లడించాడు.
ఎప్పుడైతే రానా దీని మీద స్పందించాడో అప్పటి నుండి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరో ఎక్కడ సినిమాలకు దూరం అవుతాడో అని వారంతా బాధపడ్డారని సోషల్ మీడియా వేదిక గా వారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: