ధనుష్-ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ..!!

Divya
RRR చిత్రంతో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మొదలయింది. ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ రేసులో నిలబడ్డారు. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల కాంబినేషన్లో సినిమాలు రావడానికి రాజమౌళి ఒక దారి ఏర్పరిచారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కొంతమంది దర్శకులు కథలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా తమిళ స్టార్ హీరోతో కలిసి తెలుగు హీరోలను చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన కొంతమంది దర్శకులకు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో డైరెక్టర్ మణిరత్నం ఇలాగే ప్లాన్ చేయడం జరిగింది.కానీ అది వర్కౌట్ కాలేదు. ఇదంతా ఇలా ఉండగా కోలీవుడ్ టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు వెట్రి మారన్. ధనుష్ హీరోగా ఆయన చేసిన సినిమాలు అసురన్ వడ చెన్నై ఇలాంటి సినిమాలు చేశారు. ఎక్కువగా కల్టు కంటెంట్ తో ఈ సినిమాలు చేయడమే బ్రాండ్ గా ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం తారక్ కి కథ చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.
ధనుష్, తారక్ కాంబినేషన్లు సౌత్ ఇండియాలోనే భారీ మల్టీ స్టార్ సినిమా రాబోతున్నదని అందుకోసం డైరెక్టర్ వెట్రిమారన్ పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లుగా టాకు వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రాజెక్టు ఉండబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్ళగానే ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 32వ సినిమా అని డైరెక్టర్ వెట్రీ మారన్ దర్శకత్వంలో ధనుష్ తో కలిసి చేయబోయే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఈ చిత్రానికి తమిళ ప్రొడ్యూసరే నిర్మాతక వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారోచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: