"పుష్ప 2" లో ఆ క్రేజీ హీరోయిన్ ... అనే వార్తలు ఎలాంటి వాస్తవం లేదు..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 వ సంవత్సరంలో విడుదల అయిన పుష్ప ది రైస్ అనే మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నటుడు అయినటు వంటి ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించగా ... సునీల్ ... అనసూయ ... రావు రమేష్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 2021 వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల మూవీ అన్ని భాషల ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ... అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించింది. ఇలా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ ల u సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినటు వంటి సాయి పల్లవి ఒక కీలకమైన పాత్రలో నటించబోతుంది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో సాయి పల్లవి నటిస్తుంది అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: