ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పూరి- ఛార్మి కెమెరాకు చిక్కారుగా?
ప్రేక్షకులు ఏది అనుకుంటే అది అనుకోండి అన్నట్లుగానే వారికే వదిలేసారు. ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలం నుంచి చార్మి, పూరి జగన్నాథ్ విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. దీనికి కారణం విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడమే. ఈ సినిమా కోసం చార్మి తన దగ్గర ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడి పెట్టింది. కానీ సినిమా విడుదలైన తర్వాత పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టాలే మిగిలాయ్. దీంతో ఇక చార్మి పూరి విడిపోయారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత అటు ఇక పూరి జగన్నాథ్, చార్మి జంట ఎక్కడా కెమెరా కంటపడ్డది కూడా లేదు. అంతేకాదు చార్మి సోషల్ మీడియాకు కూడా టాటా చెప్పేసింది. దీంతో ఇక వీరిద్దరూ ఏం చేస్తున్నారు అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే చాన్నాళ్ల తర్వాత ఇక ఈ జంట ఇక ఇప్పుడు కెమెరాకు చిక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూరి, చార్మి ముంబై ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు. ఇక ఇంత గ్యాప్ తర్వాత ఈ జంట కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా తమ కెమెరాలకు పని అని చెప్పి క్లిక్ మనిపించారు. ఇక ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.