బాలీవుడ్ నటీమణుల కోసం టాలీవుడ్ ఎందుకు అలా చేస్తోంది..!!
ఇక అసలు విషయంలోకి వస్తే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 30వ చిత్రానికి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈమె కోసం దాదాపుగా రూ .5కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం కేవలం మూడు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేదని సమాచారం. ఇక మరొక హీరోయిన్ కియారా అద్వానీ. భరత్ అనే నేను చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ గా నిలిచింది ప్రస్తుతం RC -15 చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అందుకుగాను ఈమె రూ .4కోట్ల రూపాయలు తీసుకుంటోందని అని సమాచారం.
ఇప్పుడు మరొక హీరోయిన్ దీపికా పదుకొనే. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ -K చిత్రం కోసం హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈమెకు దాదాపుగా రూ.13 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బాలీవుడ్ నుంచి హీరోయిన్లను టాలీవుడ్కు తీసుకురావడం వెనుక అసలు విషయం ఏంటన్నది ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.