స్వాతిముత్యం దర్శకుడితో నవీన్ పోలిశెట్టి సినిమా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాఆ తర్వాత ఈ యువ హీరో అనుదీప్ కే వి దర్శకత్వంలో రూపొందినటు వంటి జాతి రత్నాలు మూవీ లో హీరోగా నటించాడు.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ లో నవీన్ నటన కు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తో నవీన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా జాతి రత్నాలు మూవీ తో ఈ హీరో క్రేజ్ అమాంతం పెరగడంతో ప్రస్తుతం నవీన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస సినిమా అవకాశాలు లభిస్తున్నాయి.

అందులో భాగంగా ప్రస్తుతం నవీన్ అనేక మూవీ లలో హీరోగా నటిస్తూ కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నవీన్ తాజాగా మరో దర్శకుడు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన స్వాతిముత్యం సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ కె కృష్ణ ... నవీన్ తో ఒక మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ... అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు నవీన్ కు ఒక కథ వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన నవీన్ వెంటనే ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: