Video: అమెరికా అభిమానులతో NTR సందడి?

Purushottham Vinay
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి ఇంకా ఎంఎం కీరవాణి ఇప్పటికే యూఎస్ మీడియాతో సమావేశం కాగా తాజాగా సోమవారం నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్ వేడుకల కోసం అమెరికా వెళ్లారు. అయితే ముందుగానే ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఆలస్యంగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానానికి పదాలు రావట్లేదని ఇంకా అంతకు మించి అభిమానం తన గుండెల్లో ఉందని అన్నారు ఎన్టీఆర్.


'మీరు చూపిస్తున్న అభిమానానికి నేను పదాలు కనిపెట్టలేను. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వందరెట్లు అభిమానం అనేది నా గుండెల్లో ఉంది. ఇక అది నేను చూపించలేకపోతున్నాను. మన మధ్య్ ఏ రక్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు దగ్గరయ్యానో నాకు తెలియ లేదు. మీరందరూ కూడా నా సోదరుల కంటే ఎక్కువ. మనది రక్త సంబంధం కంటే చాలా గొప్పదైన బంధం. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను' అని అన్నారు తారక్.


 అభిమానులు చూపించే ప్రేమకు తాను రుణపడిపోయానని ఎన్టీఆర్ చెప్పారు.ఇంకా అలాగే ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతున్నంత సేపు ఆయన అభిమానులు అరుస్తూ.. కేకలు పెడుతూ ఆయన స్పీచ్ ను బాగా ఎంజాయ్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. చరణ్.. తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్ ప్రదానోత్సవం వేడుకలు మార్చి 12 వ తేదీన జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: