మోసం చేసానని తెల్సి కూడా ఆయన నన్ను ఏమి అనలేదు :: బండ్ల గణేష్ వ్యాఖ్యలు

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే.రవితేజ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఆంజనేయులు మూవీ తెరకెక్కగా ఈ మూవీ కు మరీ అద్భుతమైన టాక్ రాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.ఐతే ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా నటించగా పరశురామ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా చేసారు.
ఐతే తాజాగా బండ్ల గణేష్ ఒక ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఐతే తాను రవితేజను మోసం చేశానని ఆయన తెలిపారు. ఒక ల్యాండ్ విషయంలో నేను రవితేజను మోసం చేయడం జరిగిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. రవితేజకు నేను ఒక పొలం అమ్మగా రవితేజ ఎంతో ఇష్టపడి ఆ పొలం కొనుక్కున్నాడని ఆయన తెలిపారు.
ఐతే ఆ పొలం కింద నాకు 30 ఎకరాల పొలం ఉందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి నా 30 ఎకరాల పొలం కొంటానని చెప్పాడని అయితే రవితేజ పొలంతో పాటు ఆ పొలం కావాలని చెప్పడంతో రవితేజకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూ సేకరణ చేస్తుందని ఇప్పుడే పొలం అమ్మితే బెటర్ అని చెప్పి పొలం అమ్మించానని బండ్ల గణేష్ చెప్పాడు. రవితేజకు అబద్ధం చెప్పి మోసం చేశానని బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.
ఆ తర్వాత నేను మోసం చేశాను అని రవితేజకు చెప్పగా ఆ విషయం  నాకు ఇంతకు ముందే తెల్సని రవితేజ అన్నారు. ఐతే ఆయన నన్ను ఏమీ చేయకుండా వదిలేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే ప్రెసెంట్ బండ్ల గణేష్ వెల్లడించిన విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: