పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న రవితేజ..!!

murali krishna
మాస్ రాజా రవితేజ మంచి స్పీడ్ మీద వున్నాడు .. ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ భారీ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు ఇక రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో అయితే ఉన్నాడని చెప్పాలి.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఆయన ఉన్నాడు..
గత డిసెంబర్ లో ధమాకా సినిమాతో వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది... ఈ సినిమా విజయాన్ని రవితేజ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే వాల్తేరు వీరయ్య విడుదల అయ్యి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. రవితేజ తన వరుస సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.  రవితేజ సినిమాలలో ముందుగా విడుదల కాబోతున్న సినిమా ''రావణాసుర''.. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.. ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యిందని సమాచారం.. అది పూర్తి అయ్యి వారం కూడా కాక ముందే మరో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసాడు..

రవితేజ కెరీర్ లో భారీ పాన్ ఇండియా సినిమా గా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా వస్తుంది.. డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముందు నుండి పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టిస్తుంది.ఇక ఇప్పుడు వైజాగ్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ మేరకు వీడియో కూడా  విడుదల చేసారు.. ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా కోసం రవితేజ భారీగా వర్క్ అవుట్ చేస్తున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: