PS2: నిర్మాతలకు లాభాలు.. సినిమాకి రికార్డులే?

Purushottham Vinay
గత సంవత్సరం రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తమిళ స్టార్స్ నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ సినిమాని తమిళ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించాడు.తమిళ పొన్నియిన్ సెల్వన్ నవలని బేస్ చేసుకొని వచ్చిన ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్య బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ఇంకా అలాగే శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది.ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమా విడుదల తేదీ చేంజ్ అయ్యింది అంటూ రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా దీని పై చిత్ర నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ సినిమాని మద్రాస్ టాకీస్ పతాకం పై మణిరత్నం ఇంకా లైకా ప్రొడక్షన్స్ పతాకం పై సుబాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఎలాగైనా పక్కగా పొన్నియిన్ సెల్వన్-2 ని ఏప్రిల్ 28 నే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పక్కా క్లారిటీ ఇచ్చారు. దీంతో విడుదల తేదీ మారింది అంటూ వచ్చిన వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాకి దాదాపు 500 కోట్లు ఖర్చు అయ్యింది. మొదటి బాగంతోనే ఈ బడ్జెట్ మొత్తాన్ని సినిమా ఈజీగా రాబట్టేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్స్ అన్ని కూడా నిర్మాతలకు లాభాలే.ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని డైరెక్టర్ మణి రత్నం పక్కాగా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS2

సంబంధిత వార్తలు: