HBD కమిలిని ముఖర్జీ: సినిమాలు మానేసి ఏం చేస్తుందంటే?

Purushottham Vinay
HBD కమిలిని ముఖర్జీ: సినిమాలు మానేసి ఏం చేస్తుందంటే ?

టాలీవుడ్ హీరోయిన్ కమిలిని ముఖర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.'గోదావరి' సినిమా పేరు చెబితే చాలు టక్కున ఈమె గుర్తొస్తుంది.నేడు ఆమె 39వ పుట్టినరోజు.మార్చి 4,1984 లో కోల్ కతాలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది.అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ బెంగాలి ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలకు పూర్తిగా చెక్ అమెరికాలో సెటిల్ అయ్యింది.ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. కొన్ని గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. ప్రతి ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే చాలు అనేలా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రీసెంట్ గా కమలినీ ముఖర్జీకి సంబందించిన లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆమె లుక్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఇదేంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 2004 వ సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కిన ఆనంద్ సినిమాతో కమిలిని ముఖర్జీ టాలీవుడ్‭కు పరిచయమయ్యారు. 


ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలినికి ఆ తర్వాత చాలా వరుస అవకాశాలు వచ్చాయి. గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, జల్సా ఇంకా గోపి గోపిక గోదావరి వంటి సినిమాల్లో ఆమె నటించారు. చివరిగా గోవిందుడు అందరివాడే సినిమాలో ఆమె నటించారు.ఇక ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయే పాత్రల్లో నటించారు. తన అందం, అభినయంతో యూత్ ని కటిపడేశారు. ఇక పూర్తిగా సినిమాలకు దూరమైన కమిలినీ.. అమెరికాలోనే ఉంటూ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. రీసెంట్ గా డల్లాస్‭లో జరిగిన ఓ ఈవెంట్‭లో ఈమె కనిపించింది. ఇక ఇందుకు సంబందించిన ఫోటోలు బయటికి రావడంతో కమిలిని ముఖర్జీ లుక్ చూసి నెటిజెన్లు అంతా దెబ్బకు షాక్ అయ్యారు. ఇలా మారిపోయింది ఏంటి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: