విరూపాక్ష టీజర్ లాంచ్ చేయనున్న పవన్ కళ్యాణ్..!

Divya
మెగా హీరో సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ నుంచి కోరుకున్న తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం విరూపాక్ష. ఇప్పటికే ప్రేక్షకులలో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా యాక్సిడెంట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి చాలా ఆసక్తి కనబరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల అయ్యి సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ను కూడా లాంచ్ చేయడానికి పవన్ వస్తున్నాడని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
సాయి ధరంతేజ్ హీరోగా నటిస్తున్న విరూపాక్షా సినిమా టీజర్ను మార్చి 1వ తేదీన లాంచ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.  ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ లాంచ్ ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ టీజర్ లాంచ్ కు ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు ఇప్పుడు సినీ వర్గాలలో ఒక వార్త చాలా జోరుగా చెక్కర్లు కొడుతోంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్,  సాయి ధరంతేజ్ కాంబినేషన్లో ప్రముఖ తమిళ దర్శకుడు అలాగే యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని ఒక సినిమాను మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు సాయి ధరంతేజ్ నెక్స్ట్ మూవీ ని కూడా ఆయన ప్రమోట్ చేయడానికి ఓకే చెప్పినట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి..
ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే సాయిధరమ్ తేజ్ సినిమా టీజర్ లాంచ్ కి వస్తే నిజంగా అది అభిమానులకు పండగ అని చెప్పాలి .చాలా రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమాకు పవన్ గెస్ట్ గా వస్తుండడంతో సినిమా టీజర్ లాంచ్ కోసం మెగా అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక మిస్టికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: