సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా "జైలర్". దీనిపై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.ఆ అంచనాలకి ప్రధాన కారణం సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటిస్తున్న 169వ సినిమా ఇది.ఇక సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి మరో విశేషం స్టార్ డమ్. ఎందుకంటే రజనీకాంత్తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ నటుడు సునీల్, వసంత రవి, యోగి బాబు, నటి రమ్యకృష్ణ ఇంకా అలాగే తమన్నా వంటి నటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ సంగీతాన్ని ఇంకా విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఇప్పటికే 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం తెలుస్తుంది.
ఇక అసలు విషయం ఏమిటంటే నటి తమన్నా భాటియా మొదటిసారిగా ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడీ చిత్రం షూటింగ్లో తమన్నా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్ట్రాగామ్లో విడుదల చేసిన చిన్న వీడియో ద్వారా తెలిపారు. ఇక ఈ సందర్బంలో షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు షేర్ చెయ్యగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ చిత్రం టాకీ పార్ట్ జరుగుతోందని, ఇందులో నటించడం చాలా హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.జైలర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. కాగా ఈ సినిమాని దీపావళి పండుగ సందర్భంగా ఆగస్ట్ నెలలో విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాలో అనేక మంది పెద్ద నటులు ఉండడంతో జైలర్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయనే చెప్పాలి.