ఆ సినిమాలో ఆ పాత్ర చేయడం వల్ల నా ఇమేజ్ అంతా పోయింది : రాశి
అలా చాలా రోజుల పాటు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగిన ఆవిడ హీరోయిన్ గా కెరియర్ ముగిసిన తర్వాత వెంకీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా చేశారని తెలుస్తుంది.అలాగే డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమా లో విలన్ అయిన గోపిచంద్ కు జోడిగా నటించారు. ఈ క్యారెక్టర్ లో చేసిన ఆమెకి జనాల నుంచి బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ క్యారెక్టర్ లో రాశి ని చూసిన వాళ్ళు అప్పట్లో మంచి హీరోయిన్ గా చేసిన రాశి ఈవిడేనా అని ఒక్కసారి గా డౌట్ పడ్డారటా.. అలా ఆవిడకి ఆ సినిమా పెద్ద మైనస్ అయింది. అయితే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాశి ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ తేజ నాకు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందని అస్సలు చెప్పలేదు రౌడీ భార్య గా చేయాలి అంటే నేను ఒప్పుకున్న కానీ తీరా టైం కి నాకు ఈ క్యారెక్టర్ చెబితే నేను చేయలేను అని తనకి చెప్పాను. అప్పుడు తేజ ఉండి లేదు మీరు చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చేయకపోతే మా షూట్ ఆగిపోతుంది అని చెప్పుకొచ్చారట.ఎంత చెప్పినా మూవీ టీమ్ అస్సలు వినిపించుకోలేదట. దాంతో తప్పక ఆ క్యారెక్టర్ నేను చేశాను అని చెప్తూ ఆ రకం గా క్యారెక్టర్ గురించి ముందే పూర్తిగా చెప్పక తేజ గారు నన్ను మోసం చేశారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.. ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు తనను అభిమానించే ఫ్యాన్స్ కి ఆమె సారీ కూడా చెప్పారు.ఇక అప్పటి నుంచి ఏదైనా సినిమా చేయాలంటే ముందు తన క్యారెక్టర్ డీటైల్స్ పూర్తిగా తెలుసుకున్నాకే చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.