ఆ మూడు భారీ మూవీ లతో పోటీ పడనున్న రవితేజ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం రవితేజ ఏకంగా మూడు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందినటువంటి ఖిలాడి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత రవితేజ ... శరత్ మండువా దర్శకత్వంలో రూపొందినటువంటి రామారావు అన్ డ్యూటీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశపరచింది. ఇలా పోయిన సంవత్సరం రెండు మూవీ లతో  ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ పోయిన సంవత్సరం చివరన త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందినటు వంటి ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఈ మూవీ ద్వారా రవితేజ 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఇలా పోయిన సంవత్సరం చివరలో ధమాకా మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా రవితేజ ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన వాల్టేరు వీరయ్య సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించాడు. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య మూవీ లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇదే తేదీన మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఎస్ ఎస్ ఎం బి 28 ... రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ ... రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న అనిమల్ మూవీలను కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ లు ఇప్పటికే ప్రకటించాయి. ఇలా ఈ మూడు భారీ మూవీ లతో రవితేజ పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: