రాజమౌళి చెప్పిన ఆ మాటకు నా గుండె ఆగినంత పని అయింది : మమతా మోహన్ దాస్

murali krishna
మమతా మోహన్ దాస్ పరిశ్రమకు ఒక సింగర్ గా పరిచయమయ్యారు.ఇలా తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను పాడినటువంటి ఈమెలో ఒక హీరోయిన్ దాగి ఉందని గుర్తించిన జక్కన్న తనకు యమదొంగ సినిమా లో అవకాశం ఇచ్చారట..ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం క్యాన్సర్ బారినపడి ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొని అయితే నిలబడింది.
ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మమత మోహన్ దాస్ తను అరుంధతి సినిమాని వదిలి పెట్టుకోవడం గురించి కొన్ని ఆసక్తి కర విషయాలను తెలియజేశారు.తనకు తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త కావడంతో ఇక్కడ నిర్మాణ సంస్థలు ఎలా ఉంటాయో తనకు అస్సలు తెలియదని తెలిపారు. అయితే అప్పుడే తనకు శ్యాం ప్రసాద్ రెడ్డి అరుంధతి సినిమా అవకాశం ఇచ్చారు.. అయితే ఆ ప్రొడక్షన్ సంస్థ మంచిది కాదు అని తన మేనేజర్ చెప్పడంతో నేను ఆ సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేకపోయానని చెప్పుకొచ్చారు.. ఇలా ఈ సినిమా కోసం శ్యాంప్రసాద్ రెడ్డి గారు దాదాపు రెండు మూడు నెలల పాటు నాకోసం ఎదురు చూసారు. ఇక ఈ సినిమా నుంచి తాను తప్పుకోవడంతో అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
ఇక ఈ సినిమా వదులుకున్న తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో తాను నటించానని చెప్పుకొచ్చింది.. అయితే యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి గారు తనతో మాట్లాడుతూ మీరు అరుంధతి సినిమా వదులుకొని పెద్ద తప్పు చేసారని చెప్పుకొచ్చారు.ఎంతో గొప్ప డైరెక్టర్ ఇలాంటి మాట అనడంతో ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయిపొయింది..అయితే అప్పటికి ఇంకా అరుంధతి సినిమా అయితే విడుదల కాలేదు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు కూడా తెలిసిందే. ఇలా మమతా మోహన్ దాస్ అరుంధతి సినిమా గురించి రాజమౌళి చెప్పిన మాటలు గురించి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: