'RC15' కోసం కియారా అద్వానీ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Anilkumar
కియారా అద్వానీ ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్ళికి సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు 'ఆర్ సి 15' అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ ఫిలిమ్ సర్కిల్స్ లో వైరల్ గా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా RC15 సినిమా నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి గాను హీరోయిన్ కియారా అద్వానీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కియారా ఏకంగా నాలుగు కోట్ల వరకు తీసుకుంటుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

నిజానికి టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న కియారా అద్వానీ నాలుగు కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బాలీవుడ్ లో ఈమె ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసింది. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ తో పాటు మరో హీరోయిన్గా అంజలి నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, జయరాం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: