ఎన్టీఆర్ సింహాద్రిని మిస్ చేసుకున్న స్టార్స్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమాతోనే ఎస్ ఎస్ రాజమౌళి పెద్ద డైరెక్టర్స్ లిస్టులో చేసరిపోయాడు ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయాడు..అలా చాలా పెద్ద విజయం అందుకున్న ఈ సినిమాలో మొదట తారక్ మొదటి హీరో కాదట. సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ స్టోరీ ని మొదట బాలకృష్ణ కి చెప్పార. అప్పటికే సమర సింహ రెడ్డి ఇంకా అలాగే నరసింహ నాయుడు లాంటి పవర్ఫుల్ సినిమాలు చేసిన బాలయ్య ఈ స్టోరీ కూడా అలాగే ఉంది అనుకొని ఈ సినిమాని ఒప్పుకోలేదట.ఆ సినిమా తర్వాత రాజమౌళి ఈ స్టోరీ ని ప్రభాస్ కి చెప్పడం జరిగింది.ఇక ప్రభాస్ ఈ స్టోరీ విని కొంచం టైం కావాలి అని అడిగాడట.దాంతో కొన్ని రోజులు వెయిట్ చేసిన జక్కన్న చాలా రోజులకి ప్రభాస్ నుంచి సమాధానం రాకపోవడంతో రాజమౌళి తారక్ తో ఈ సినిమా చేసి హిట్ కొట్టాడు. 


ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఛత్రపతి ఇంకా బాహుబలి సిరీస్ వచ్చాయి.అయితే సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ ఇప్పటికి  భాదపడుతుంటాడు...సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ కి అప్పట్లోనే ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.రాజమౌళి ఇంకా ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 4 సినిమాలు కూడా సూపర్ హిట్స్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ ని స్టార్ హీరోని చేయడం లో రాజమౌళి పాత్ర చాలానే ఉందనే చెప్పాలి..ఇక రీసెంట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ అయితే గ్లోబల్ రేంజిలో పెద్ద హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ని పెద్ద పాన్ ఇండియా హీరోగా మార్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: