ఇక రీసెంట్ గా "వాల్తేరు వీరయ్య" సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇటీవల ఓ కామెడీ ట్రాక్ ని కూడా రాసుకున్నారట. ఇటీవల దాని షూటింగ్ కూడా జరిగిందట. అది అందరికీ తెలిసిందే.'ఖుషీ' ఇంటర్వెల్ ట్రాక్ అని మనం ఇది వరకే తెలుసుకున్నాం..ఈ సినిమాలో తమ్ముడి పవన్ సీన్స్ను చిరంజీవి ఇమిటేట్ చేయబోతున్నాడట.ఇంకా అంతేకాదు తన బ్లాక్ బస్టర్ సాంగ్కి చిరంజీవి డ్యాన్స్ కూడా చేస్తాడట.ఇలా ప్రతిదీ పాత చిరంజీవిని ఇంకా పాత సినిమాలోని సన్నివేశాలని అన్నిటిని మిక్స్ చేసి రుబ్బుతున్నాడట మెహర్ రమేష్.అయితే అయితే ఈ విషయంలో కొంతమంది అభిమానులు మాత్రం చాలా డిఫరెంట్గా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఎవరైనా అభిమానిగా ఉండాలి కానీ.. చిరంజీవి మాత్రం వేరేవాళ్లకు అభిమానిగా నటించడమేంటి? అందులో కూడా పవన్కు ఫ్యాన్స్గా నటించడం ఏంటి అని అడుగుతున్నారు.
అయితే చిరుకు లేని బాధ మీకేంటి ఏంటి అని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. పవన్ ఇప్పటికే చాలా సినిమాల్లో చిరంజీవి పేరును ఇంకా నటనను ప్రస్తావించారు. ఇప్పుడు తమ్ముడు పవన్ ఫ్యాన్గా చిరంజీవి కనిపిస్తారు. తమ్ముడిలా అన్న నటిస్తే ఆనందపడాలి కానీ.. ఈ పంచాయితీ ఏంటి కొంతమంది స్పందిస్తున్నారు.ఇంకా మెహర్ రమేష్ డైరెక్షన్ పై చాలా డౌట్ గా ఉన్నారు. అతను పాత రొట్ట సీన్లు అన్ని కలిపి మిక్స్ చేసి జ్యూస్ చేసి ఇందులో ప్రయోగిస్తున్నారు. కొంత వరకు ఒకే.. కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని సమాచారం తెలుస్తుంది. మరి చూడాలి ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో..చిరంజీవి రీసెంట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల అయ్యి ఏకంగా 230 కోట్లకు పైగా వసూళ్లు చేసి చిరంజీవి సత్తా ఏంటో నిరూపించింది.