ఏంటి.. చిరంజీవి అప్పట్లోనే పాన్ ఇండియా మూవీని వదులుకున్నాడా?
ఇకపోతే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా నటిస్తుంది అని చెప్పాలి. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే శంకర్ ఒకప్పుడు చరణ్ తండ్రి చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నారట. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో ముందుగా చిరంజీవిని తీసుకోవాలని అనుకున్నాడట.
అయితే ఆ సమయంలో కథను చిరంజీవికి వినిపించారట శంకర్. కానీ ఇక అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా శంకర్ సినిమా కోసం చిరంజీవి డేట్స్ కేటాయించలేకపోయారట. ఇక తర్వాత ఈ సినిమా అర్జున్ వద్దకు వెళ్ళగా.. అతను చేసి సూపర్ డూపర్ విజయాన్ని సాధించాడు. ఈ సినిమా చేసి ఉంటే అప్పట్లోనే చిరంజీవి పాన్ ఇండియా హిట్ కొట్టేవాడు అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసి అయ్యయ్యో మెగాస్టార్ ఇంత మంచి ఛాన్స్ వదిలేసుకున్నాడా అనే ఎంతో మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు.