బేబమ్మతో శర్వానంద్ రొమాన్స్..!

shami
ఉప్పెన సినిమాతో ఒక్కసారి తెలుగు యూత్ ఆడియన్స్ ని తన వల్లో వేసుకున్న బేబమ్మ అలియాస్ కృతి శెట్టి ఆ సినిమాతో అరడజనుకి పైగా సినిమాలు ఛాన్స్ అందుకుంది. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చిన అమ్మడికి తక్కువ టైం లోనే షాక్ తగిలింది. చేసిన ఆరు సినిమాల్లో 3 హిట్లు, 3 ఫ్లాపులు అయ్యాయి. అందుకే ఇక మీదట కథల విషయంలో జాగ్రత్త పడాలని చూస్తుంది. అందుకే ఇదివరకులా కథలు ఓకే చేయకుండా ఆచి తూచి అడుగులేస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేస్తున్న కృతి శెట్టి యువ హీరో శర్వానంద్ సినిమాను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
యువ హీరోల్లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ రకరకాల ప్రయత్నాలతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. కృతి శెట్టితో శర్వానంద్ రొమాన్స్ సినిమాకు ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. ఒకే ఒక్క జీవితం సినిమాతో కమర్షియల్ గా హిట్ కొడతాడు అనుకున్న శర్వానంద్ ఆ సినిమాతో కూడా నిరాశపరిచాడు. అందుకే ఈసారి కమర్షియల్ హంగులతో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
శర్వానంద్, కృతి శెట్టి ఇద్దరి జోడీ సినిమాకు హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. భలే మంచి రోజు నుంచి డైరెక్టర్ గా తన ప్రతి ఛాన్స్ వాడుకునేలా చేస్తున్న శ్రీరాం ఆదిత్య శర్వానంద్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది. సినిమా కథ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. శర్వానంద్ మాత్రం ఈ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత కృష్ణ చైతన్యతో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: