నా ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ ఊహించుకొని రాస్తాను : శేఖర్ కమ్ముల

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు..
క్లాస్ సినిమాల ద్వారా శేఖర్ కమ్ముల పాపులారిటీని ఊహించని రేంజ్ లో పెంచుకున్న విషయం తెలిసిందే. ఆనంద్ సినిమాతో శేఖర్ కమ్ములకు మంచి పేరు అయితే వచ్చింది. రాజా మరియు కమిలినీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో ఈ మంచి కాఫీ లాంటి సినిమా తెరకెక్కింది.
ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఆనంద్ సినిమాను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని చెప్పుకొచ్చారు.. ప్రేక్షకులు సినిమా నచ్చితేనే వెళతారని ఆయన కామెంట్లు కూడా చేశారు. సక్సెస్ ఫార్ములాను ఎవరూ చెప్పలేమని శేఖర్ కమ్ముల అన్నారు. నేను కొన్ని సినిమాల రేంజ్ ను ఊహించానని ఆయన తెలిపారు. సినిమాల అసలు లెక్కలు మాత్రం వేరే విధంగా ఉంటాయని శేఖర్ కమ్ముల అన్నారు.
సినిమా బడ్జెట్ కు అనుగుణంగా తాను డబ్బు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.. హ్యాపీడేస్ మూవీని చాలా తక్కువ లాభానికి దిల్ రాజుకు ఇచ్చానని శేఖర్ కమ్ముల  తెలిపారు.. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆస్తులు అమ్ముకుని మరి సినిమాల హక్కులు కొంటారని కొంతమంది తమ ఆర్థిక కష్టాలను చెప్పుకుంటారని శేఖర్ కమ్ముల అన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా నష్టాలు వస్తే డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన తెలిపారు.
పవన్  కళ్యాణ్ నాకు బాగా ఇష్టమైన హీరో అని ఆయనను దృష్టిలో ఉంచుకుని కథను కూడా రాశానని శేఖర్ కమ్ముల తెలిపారు. నాకు వేరే ఆప్షన్ లేకపోవడంతో చిరంజీవి గారి శంకర్ దాదా సినిమా టైమ్ లో ఆనంద్ సినిమాను విడుదల చేశానని ఆయన అన్నారు. ఆస్తులు అమ్మి మరి ఆనంద్ సినిమా తీశానని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.శేఖర్ కమ్ముల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: