ఎన్టీఆర్ సినిమా కోసం భారీగా పారితోషకం తీసుకుంటున్న ఆ స్టార్ హీరోయిన్...!!

murali krishna
ఎన్టీఆర్ గత సంవత్సరం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు  ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని అయితే సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా కూడా తగ్గలేదని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులవుతున్న కానీ ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు అన్న సంగతి అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అయిన ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి తాజా అప్డేట్లు మాత్రం రాలేదు. ఇకపోతే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనుంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ లో కూడా జాన్వీ పూర్ పాల్గొంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త  మాత్రం తెగ వినిపిస్తుంది.. ఎన్టీఆర్ సినిమాకు గాను జాన్వీ కపూర్ భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు సమాచారం..

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో జాన్వీ కపూర్ తన పాత్ర కోసం ఆమె భారీ స్థాయిలో ఏకంగా రూ. 3.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. తన నటనతో బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది జాన్వీ కపూర్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తుంది.. అయితే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చిత్ర బృందం ఆ విషయంపై అధికారికంగా స్పందించలేదు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ విషయంలో కొద్దిగా నిరుత్సాహం లో ఉన్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: