హాట్ టాపిక్ గా మారిన కోన వెంకట్ ప్రయోగం !

Seetha Sailaja
కమర్షియల్ సినిమాల రచయితగా ఒక వెలుగు వెలిగిన కోన వెంకట్ హవా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అనేకమంది టాప్ హీరోల సినిమాలకు అతడు కథలను అదేవిధంగా స్క్రీన్ ప్లేని అందించి హిట్ సినిమాల రచయితగా ఒక వెలుగు వెలిగాడు. అయితే ఆతరువాత అతడి హవా మసక బారింది.

దర్శకుడుగా మారి పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించాలి అన్న కోరిక నెరవేరక పోవడంతో నిర్మాతగా అయినా సక్సస్ అవ్వాలని కొన్ని సినిమాలు తీసినప్పటికీ అతడిని విజయం పలకరించలేదు. లేటెస్ట్ గా అతడి శిష్యుడు బాబి దర్శకత్వం వహించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకు రైటింగ్ విభాగంలో కోన వెంకట్ చాల ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఆసినిమా ఘన విజయానికి తనవంతు సహాయం చేసాడు.

ఈ విజయం ఇచ్చిన జోష్ తో ఈయన ఒక వెబ్ సిరీస్ తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జీ5 తో భాగస్వామిగా మారి ఈయన్ ఈ వెబ్ సిరీస్ ను తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరస ఫెయిల్యూర్ లతో సతమతమైపోతున్న ఆది సాయి కుమార్ లావణ్య త్రిపాఠీ లను నమ్ముకుని ఈయన ఈ ప్రయోగ చేస్తున్నాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ కు ‘పులి మేక’ అన్న టైటిల్ ను పెట్టారు.

వరసపెట్టి పరాజయాలు వెంటాడుతున్నా వాటిని లెక్కచేయకుండా ఆది సాయి కుమార్ వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే విజయం అన్న పదం అతడి కాంపౌండ్ దరికి రావడం లేదు. ఇక లావణ్యా త్రిపాఠి విషయానికి వస్తే యంగ్ హీరోయిన్స్ హవా పెరిగి పోవడంతో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గి పోయాయి. ఇలాంటి పరిస్థితులలో ఏమాత్రం ఇమేజ్ లేని వీరిద్దరినీ నమ్ముకుని కోన వెంకట్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సస్ అవుతుంది అంటూ కొందరు సందేహాలను వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: