ఆర్ ఆర్ ఆర్ మ్యానియాతో రాజీపడిన కొరటాల !

Seetha Sailaja

కొరటాల ఎట్టకేలకు జూనియర్ తో తీయబోతున్న తన సినిమాకు సంబంధించిన అన్ని సమస్యలను అధికమించి ఆమూవీ ప్రారంభోత్సవాన్ని ఈనెల 24న అత్యంత భారీ స్థాయిలో చేయబోతున్నాడు. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తో ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో కొరటాల సమస్యలను ఎదుర్కున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే అసలు వాస్తవం వేరు అన్న లీకులు వస్తున్నాయి.
 
 
ఈసినిమాకు సంబంధించి కొరటాల క్రియేట్ చేసిన స్క్రిప్ట్ జూనియర్ కు బాగా నచ్చినప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం తరువాత తారక్ కు బాలీవుడ్ లో ఏర్పడ్డ ఇమేజ్ రీత్యా జూనియర్ సలహాతో మొదట్లో కొరటాల అనుకున్న కథలో 50 శాతం వరకు మార్చవలసి వచ్చింది అన్న లీకులు వస్తున్నాయి. ఇలా 50శాతం కథలో మార్పులు రావడంతో ఈమూవీ మూల కథలో మార్పులు రావడంతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో కూడ అనేక మార్పులు చేయవలసి రావడంతో కొరటాల క్రియేటివ్ శక్తికి ‘ఆర్ ఆర్ ఆర్’ విషమ పరీక్ష పెట్టింది అని అంటున్నారు.
 
 
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో హీరోయిన్ గా నటించడానికి ఎట్టకేలకు జాన్వీ కపూర్ ను ఒప్పించారని ఆమె ఎగ్రిమెంట్ పై కూడ సంతకం చేయడంతో త్వరలో జరగబోతున్న ఈమూవీ పూజా కార్యక్రమానికి జాన్వీ వస్తోంది అని తెలుస్తోంది. దీనికితోడు అనేక ఆలోచనలు తరువాత ఈమూవీ విలన్ గా సైఫ్ ఆలీఖాన్ ఎంపిక కావడంతో జాన్వీ సైఫ్ ఆలీఖాన్ ల క్రేజ్ తో ఈమూవీ ఖచ్చితమైన పాన్ ఇండియా మూవీగా మారడమే కాకుండా ఈమూవీ మార్కెట్ కు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక కావడం బాగా సహకేరిస్తుంది అన్న అంచనాలు కూడ వస్తున్నాయి.
 
 
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన భారీ సెట్ ను రెడీ చేయడంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈమూవీ షూటింగ్ కొనసాగుతుంది అని తెలుస్తోంది. ఈమూవీకి నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యహరిస్తూ ఉండటంతో కొరటాల కు ఈమూవీ మార్కెట్ చాల సులువుగా పూర్తి అయింది అన్న సంకేతాలు కూడ ఉన్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: