ఆ సినిమా ఆగిపోలేదట.. క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రిమేక్ సినిమాలదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళ కన్నడ భాషల్లో సూపర్ హిట్ సాధించిన సినిమాలను ఇక తెలుగు హీరోలతో సరికొత్త హంగులు జోడించి తీస్తూ కమర్షియల్ విజయాలను అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే అప్పటికే సూపర్ హిట్ అయిన సినిమా కావడంతో..  ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయి ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో కొత్త కథలతో రిస్క్ చేయకుండా అప్పటికే హిట్ అయిన సినిమాలకు రీమేక్ చేస్తే ఇక హిట్టు గ్యారెంటీ అని నమ్ముతూ ఉన్నారు.

 భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్,  బుట్ట బొమ్మ ఇలా మలయాళం లో హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ సాధించారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు గీత ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ మరో రీమేక్ కి సిద్ధమైంది అనేది తెలుస్తుంది. 2021 ఏప్రిల్ లో విడుదలై సూపర్ హిట్ సాధించిన నాయట్టు సినిమాని ఇక తెలుగులో రీమేక్ చేయడానికి అల్లు అర్జున్, బన్నీ వాసు సిద్ధమయ్యారట. పలాస దర్శకుడు కరుణ కుమారును ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. హీరోయిన్ అంజలి కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్.

 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం బడ్జెట్ సమస్యలు రావడంతో ఈ సినిమాను ఇక అల్లు అర్జున్,బన్నీ వాసు ఆపేశారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. ఒరిజినల్ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ఇక రీమేక్ కి కూడా అంతే బడ్జెట్ పెట్టాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో రీమేక్ ని పక్కన పెట్టారంటూ వార్తలు రాగా.. ఇటీవల దీనిపై బన్నీ వాసు స్పందించారు. నాయట్టు రీమేక్ ఆగిపోలేదని ఇప్పుడు అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అంటూ చెప్పుకోచ్చాడు. త్వరలోనే ఈ మూవీ ని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: