లెజెండ్రీ యాక్టర్ ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..!
ఇక ఎన్టీఆర్.. ఏఎన్ఆర్ తో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు. అన్ని మంచి విజయం సాధించినవే.. ఇదిలా ఉండగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంలో తనకు తోడ్పడిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అలా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పటికి ఆ పథకాలను అమలు అయ్యేలా ఆయన చేయగలిగారు అంటే ఆయన రాజకీయ పరిపాలన ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన బొమ్మ తో రూ.100 కాయిన్ ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.
అయితే ఈ నాణెం పూర్తిగా వెండితో తయారు కానుంది అని సమాచారం. ఈ సందర్భంగా మింట్ అధికారులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురు దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి నమూనా చూపించారట.. పురందేశ్వరి కూడా ఈ వెండి నాణాన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ని కూడా పరిశీలించి ఓకే చేసినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ వంద రూపాయల వెండి నాణెం బయటకు రానుంది అని కేంద్రం స్పష్టం చేసింది.