ధనుష్ సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..!

Divya
మొదటిసారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న చిత్రం సార్.. ఈ సినిమాను తమిళ్లో కూడా వాతి పేరిట రిలీజ్ చేయబోతున్న విషయం కూడా తెలిసిందే. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య, శ్రీకర స్టూడియో సంస్థలు కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నాయని సమాచారం.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాదు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
అంతేకాదు సోషల్ మీడియాలో తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్ మరింత గ్రాండ్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 5 గంటలకు గ్రాండ్గా జరపబోతున్నట్లు సమాచారం. అయితే ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఎవరు వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి .

ఇదిలా ఉండగా చాలా సర్ప్రైస్ లు ప్లాన్ చేశామని చిత్ర యూనిట్ కూడా అనౌన్స్ చేయడంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పుడు ఆసక్తి బాగా పెరిగింది. ఈ విషయాన్ని ఇంకా సర్ప్రైజ్ గానే ఉంచుతూ తెలుగులోనూ ధనుష్ కి  అభిమానులు బాగా ఉండడంతో వారిని ఈవెంట్ కు రప్పించడానికి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: