భారీ స్థాయి లో వసూళ్లు రాబడుతున్న రీ రిలీజ్ మూవీ...!!

murali krishna
ఇటీవల ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల హావ నడుస్తుంది.ఐతే రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించిన కొన్ని చిత్రాలను లేటెస్ట్ టెక్నాలజీలోకి మార్చి సరికొత్త అనుభూతిని కలిగించే డీటీఎస్ డాల్బీ అట్మాస్ సౌండ్ తో రిలీజ్  చేస్తున్నారు.
ఐతే ప్రెసెంట్ ఇది మన తెలుగులో చాలా కామన్ పాయింట్ అయిపోయింది. ఐతే కానీ ఈ ట్రెండ్ ని ఇప్పుడు హాలీవుడ్ కూడా చాలాబలంగా ఫాలో అయిపోతోంది. గత ఏడాది అవతార్ పార్ట్-1ని ఇలాగే రీ రిలీజ్ చేసారు.అపుడు రెస్పాన్స్ ఒక రేంజ్ లో అదిరిపోయింది.
ఐతే ఈ ఏడాది అదే జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఆల్ టైం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ 'టైటానిక్' ని ఈమధ్యనే రీ రిలీజ్ చేసారు. ఆలా విడుదల ఐనా ఈ మూవీ  బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయని విధంగా ఒక అద్భుతం ని సృష్టించింది.బహుశా జేమ్స్ కెమరూన్ కూడా ఈ మూవీ కి ఈ రేంజ్ లో వసూళ్లు వస్తాయని ఊహించి ఉండడు.
ఐతే ఫిబ్రవరి నెలలో పదవ తారీఖున రిలీజ్ ఐనా ఈ మూవీ సుమారుగా మొదటి వీకెండ్ లో ఇరవై రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు రాబట్టింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' థియేటర్స్ లో ప్రస్తుతం రన్ అవుతూనే ఉంది.ఈ మూవీ ప్రెసెంట్ నడుస్తున్న వీకెండ్ లో సుమారుగా ఇరవై  మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.కానీ 'టైటానిక్' మూవీ కి ఇరవై రెండు మిలియన్ డాలర్లు రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐతే ప్రెసెంట్  నడుస్తున్న సినిమా కంటే పాతికేళ్ల క్రితం విడుదలైన చిత్రానికి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే ప్రేక్షకులకు ఈ సినిమా అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్తున్నారు.ఐతే ఈ మూవీ లోని కొన్ని సన్నివేశాలను ఇప్పుడు చూసిన ఎదో కొత్త తరహా అనుభూతి పొందిన ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి రేంజ్ మ్యాజిక్ ని జేమ్స్ కెమరూన్ కూడా మళ్ళీ క్రియేట్ చేయలేక పోయాడు అనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: