తునివు సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. ఈ సినిమా మిశ్రమ స్పందనతోనే ఏకంగా 150 కోట్ల వసూళ్లు కోళ్లగొట్టింది. అయితే తెలుగులో తెగింపుగా విడుదల అయిన ఈ మూవీ ప్లాప్ గా నిలిచింది. ఇక తమిళనాడులో తునివు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్ కుమార్ తరువాత సినిమా విషయంలో మాత్రం ఆడియన్స్ను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ యంగ్ డైరెక్టర్తో మూవీ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు మళ్లీ తన మనసుని మార్చుకున్నారు.తెగింపు సినిమా షూటింగ్ సమయంలో అజిత్ నెక్ట్స్ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అసలు అజిత్ ఇప్పట్లో మూవీ చేసే థాట్ లో లేడని వన్ ఇయర్ బ్రేక్ తరువాతే తన తరువాత సినిమా చేస్తారన్న టాక్ చాలా గట్టిగా చక్కర్లు కొడుతోంది. కానీ ఆ తరువాత డెసిషన్ మార్చుకున్నారు అజిత్. తెగింపు సినిమా రిలీజ్ టైమ్కు తరువాత మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఈ సీనియర్ హీరో.
నయనతార భర్త యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ఉంటుంది అజిత్ క్లారిటీ ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్ కూడా ఈ విషయాన్ని అఫీషియల్గా కన్పార్మ్ చేసింది. అయితే సడన్ గా ఈ ప్రాజెక్ట్కు డిస్క్ బ్రేక్ పడింది.అజిత్ తరువాత సినిమా ఆగిపోయిందన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు తన సోషల్ మీడియా బయోలో ఉన్న ఏకే 62 అనే హ్యాష్ ట్యాగ్ను విఘ్నేష్ శివన్ తీసేయటంతో ఈ సినిమా నుంచి ఆయన పూర్తిగా తప్పుకున్నట్టే అనే ఫిక్స్ అయ్యారు కోలీవుడ్ ఆడియన్స్.ఇక సంక్రాంతి బరిలో అజిత్తో పోటి పడిన విజయ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాకి సంబంధించి టైటిల్ ని కూడా సాంగ్ తో కలిపి రివీల్ చేశారు. కానీ అజిత్ కుమార్ మాత్రం ఇంకా తన ప్రాజెక్ట్ లాక్ చేసే పనిలోనే ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అవుతున్నారు.