RRR ని మరోసారి ఆకాశానికి ఎత్తేసిన అవతార్ డైరెక్టర్?

Purushottham Vinay
హాలీవుడ్ టాప్ డైరెక్టర్  జేమ్స్ కామెరూన్.. ఆయన సినిమాలతో ఇండియాలో కూడా విపరీతమైన అభిమానులని సంపాదించుకున్నాడు. ఆయన సినిమాకి వచ్చినంత వసూళ్ల ప్రభంజనం ఏ సినిమాకి కూడా రాదు.ఇక ఈమధ్యనే ఆయన దర్శకత్వంలో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఇండియాలో కూడా భారీ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు కుమ్మరించింది. ఇక మన దర్శకధీరుడు రాజమౌళి ఓ హాలీవుడ్ అవార్డు ఈవెంట్ లో జేమ్స్ కామెరూన్ ని కలవడం ఇంకా కామెరూన్ రాజమౌళిని, rrr సినిమాని అభినందించిన విషయం కూడా తెలిసిందే.తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా జేమ్స్ కామెరూన్ తీసిన అద్భుత కావ్యం టైటానిక్ సినిమా 25 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీగా రీ రిలీజ్ కానుంది. ఇక టైటానిక్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా జేమ్స్ కామెరూన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించాడు. ఈ ప్రెస్ మీట్ లో చాలా అంశాలు గురించి మాట్లాడటంతో పాటు ఎస్ ఎస్ రాజమౌళి, ఇండియన్ సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించారు.


ఇక జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. నా టైటానిక్ సినిమా ఇండియాలో అంత గ్రాండ్ గా రిలీజ్ అవ్వలేదు. నేను 2010 లో ఫస్ట్ టైమ్ ఇండియాకి వెళ్ళాను. అప్పట్నుంచే ఇండియన్ సినిమాల గురించి ఇంకా ఇండియన్ సినీ పరిశ్రమ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అవతార్  సినిమాలకు ఇండియాలో చాలా మంచి డిమాండ్ ఉందని గ్రహించాను. ఇండియన్ సినిమాలకి ఇంకా నా సినిమాలకి మధ్య ఏదైనా తేడా ఉందంటే అది కేవలం పాటలు, డ్యాన్సులు మాత్రమే.ఇక ఇటీవల రాజమౌళిని కలిశాను. అతను తెరకెక్కించిన rrr సినిమా చూశాక అందులోని అన్ని అంశాలు కూడా నన్ను ఆలోచించేలా అచ్చేశాయి. ఈ సినిమా ఏకంగా నన్ను భారతదేశ సినిమా గురించి పెద్దగా ఆలోచించేలా చేసింది. ఈ సినిమా వల్ల నేను భారతీయ సినిమాలని ఎంతగానో ఆస్వాదిస్తున్నాను అంటూ తెలిపారు. జేమ్స్ కామెరూన్ ఇలా ప్రెస్ తో మరోసారి రాజమౌళి ఇంకా rrr సినిమాని అభినందించడంతో అభిమానులు అలాగే భారత సినీ ప్రేక్షకులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: