SSMB29: బడ్జెట్ తెలిస్తే బిత్తరపోవాల్సిందే?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి ' ఆర్ఆర్ఆర్ ' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రీసెంట్ గా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 1250 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన ఎప్పుడో వచ్చినా  కానీ మిగతా విషయాలు మాత్రం ఇంకా తెలీలేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సినిమా కోసం ఎప్పటినుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు రానటువంటి స్టోరీతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది.


ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం జక్కన్న 15 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాడని సమాచారం తెలుస్తుంది. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కు రావడంతో జూన్ లేదా జూలై నెలలో లాంచింగ్ ఉండనుందని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక ఈ సినిమాను పక్క ప్రణాళికతో ఏడాదిలో ముగించేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తి చేసే విషయంలో రాజమౌళి, అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రూపొందని విధంగా దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కె. ఎల్ నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: