రెచ్చిపోయిన హైపర్ ఆది.. రష్మీపై డబుల్ మీనింగ్ సెటైర్స్?

praveen
సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ జోడీకి అటు బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఒక్కచోట కనిపించారు అంటే చాలు చూసి మురిసిపోయే అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు కేవలం జబర్దస్త్ కి మాత్రమే పరిమితమైన ఈ జోడి క్రేజ్.. క్రమక్రమంగా బుల్లితెర మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం ఛానల్ తో సంబంధం లేకుండా రష్మీ సుధీర్ ఎక్కడ కనిపించినా కూడా ఆ షో టాప్ రేటింగ్స్ సొంతం చేసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పాలి. తామిద్దరం స్నేహితులమే అని.. తమ మధ్య ప్రేమ గీమ ఏమీ లేదు అని ఈ ఇద్దరు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు.

 కానీ ప్రేక్షకులు మాత్రం వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని ఇక పెళ్లి కూడా చేసుకుంటే చూడాలని ఆశ పడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక జబర్దస్త్ లో ఎన్నో కొత్తజంటలు పుట్టుకొచ్చిన రష్మీ సుధీర్ జోడి మాత్రం ఎవర్ గ్రీన్ జోడి గానే మిగిలిపోయింది. ఎన్నో రోజుల కిందట సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకొని పక్క చానల్స్ లో వరుసగా షోలతో బిజీగా మారిపోయాడు. మరోవైపు అటు సినిమా షూటింగ్ లతో కూడా బిజీబిజీగానే గడుపుతూ ఉన్నాడు. అయితే సుధీర్ తప్పుకున్న తర్వాత ఇక అతని స్థానంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా వచ్చింది రష్మి.

 అయితే సుధీర్ లేకపోవడంతో ఇక రష్మీపై ఆది ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు సుధీర్ ను బాబు అంటూ ఎప్పుడు రశ్మిని పరోక్షంగా ఏడిపిస్తూనే ఉంటాడు. ఇక ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో వాలెంటెన్స్ డే స్పెషల్ గా ఒకరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ రష్మీ అంటుంది. నాకు ఇవ్వు.. నేను వెళ్లి ఇస్తాను అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. బాబుకి ఏమైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసావా అంటూ ఆది సెటైర్ వేస్తాడు. అయితే సర్ప్రైజ్ ఇస్తే ఇవ్వండి కానీ బాబుని ఎత్తుకొని మాత్రం మాకు సర్ప్రైజ్ ఇవ్వరు కదా అంటూ రష్మీపై డబుల్ మీనింగ్ డైలాగులతో కౌంటర్లు వేస్తాడు హైపర్ ఆది. అయితే ఆది వేసే డబుల్ మీనింగ్ కౌంటర్లు అటు సుధీర్, రష్మీ  ఫాన్స్ కి అసలు నచ్చడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: