టాలీవుడ్ లోకి నలుగురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే?

praveen
గత రెండు దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినిపించిందంటే చాలు అందరికీ దేవిశ్రీప్రసాద్ ఎస్ఎస్ తమన్ పేర్లే గుర్తుకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికీ కూడా ఈ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. తమ మ్యూజిక్ తో ప్రేక్షకులందరికీ ఉర్రూతలూగిస్తున్నారు  చెప్పాలి. అయితే పాతనీరు పోయి కొత్తనీరు వచ్చినట్లుగానే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త వారు వస్తూ తమ టాలెంట్ నిరూపించుకుంటూనే ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సత్తా చాటుతూ ఉన్నారు. నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఇక టాలీవుడ్లో సత్తా చాటెందుకు సిద్ధమయ్యారు అన్నది తెలుస్తుంది ఆ వివరాలు చూసుకుంటే..

 హర్షవర్ధన్ రామేశ్వర్  : రవితేజ ఎప్పుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇలాగే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాతో సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
 హేశం అబ్దుల్ : నాని 30వ  సినిమాకు హేశం అబ్దుల్ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  ఇంకో పక్క ఖుషి సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా ఛాన్స్ కొట్టేశాడు. ఇక ఈ రెండు సినిమాల్లో నిరూపించుకుంటే వరుస అవకాశాలు తలుపుడు తడుతాయి.

 సంతోష్ నారాయణ్ : నాని హీరోగా వస్తున్న దసరా సినిమాకి ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కొట్టేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులు అందరూ కూడా ఆకట్టుకుంది. ఇక దసరా సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తుండడంతో ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందిస్తే అతని పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.

 రామ్ మిర్యాల : ఇప్పటికే తన పాటలతో తన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ మిరియాల ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఇక ఇప్పుడు గల్లీ రౌడీ సినిమాకి కూడా సంగీతం అందించి ప్రేక్షకులను అలరించాడు.
అంతే కాకుండా మైకెల్, దమ్కి  చిత్రాల ద్వారా కూడా కొత్త సంగీత దర్శకులు ఇండస్ట్రీలోకి రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: