ఆఖరి 5 సంవత్సరాల్లో సంక్రాంతి విన్నర్ రైస్ లో గెలిచింది ఏ మూవీనో తెలుసా..?

Pulgam Srinivas
సంక్రాంతి పండగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం సంక్రాంతి పండుగకు స్టార్ హీరోలు నటించిన మూవీలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఆ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను రాబడుతూ సంక్రాంతి విన్నారుగా నిలుస్తూ ఉంటాయి. అలా ఆకరి 5 సంవత్సరాలుగా సంక్రాంతి విన్నారుగా నిలిచిన మూవీ లు ఏవో తెలుసుకుందాం.
విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 మూవీ 2019 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సంవత్సరం విడుదల అయిన అన్ని మూవీ ల కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 2020 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సంవత్సరం విడుదల అయిన మిగతా మూవీ ల కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ మూవీ 2021 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన బంగార్రాజు మూవీ 2022 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ మూవీ లో నాగ చైతన్య ఒక కీలకమైన పాత్రలో నటించాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఈ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: