వీరసింహారెడ్డి: ఒంటి చేత్తో సినిమాని కాపాడిన బాలయ్య?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'వీరసింహారెడ్డి'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని ఇంకా అలాగే రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించడం జరిగింది. భారీ అంచనాలతో జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, అలాగే ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ వంటివి ప్రేక్షకులను బాగా అలరించడంతో ఈ సినిమాకి విడుదలకు ముందే ఒక రేంజిలో అదిరిపోయే హైప్ ని తెచ్చాయి.అయితే పాత కథనే తిప్పి తిప్పి రొట్ట కొట్టుడు కొట్టడంతో మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.మొదటి వారం ఈ మూవీ సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని బాగా క్యాష్ చేసుకొని భారీ వసూళ్లనే రాబట్టుకుంది. కానీ రెండో వారం నుంచి మాత్రం చాలా స్లోగా కలెక్ట్ చేసింది.ఇక మూడో వారం అయితే చాలా వరకు ఈ సినిమా చేతులెత్తేసింది.


ఒకసారి 3 వారాలకు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 'వీరసింహారెడ్డి' సినిమాకి రూ.70 కోట్లు దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.70 కోట్ల పైగా షేర్ ను రాబట్టల్సి.. ఉంది. ఇక 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ ఏకంగా రూ.74.98 కోట్ల షేర్ ను రాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి రూ.5  కోట్ల దాకా ప్రాఫిట్స్ ను అందించింది. బాలకృష్ణ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది 'వీరసింహారెడ్డి' మూవీ నిలిచింది. నిజానికి ఈ సినిమా బాలయ్య వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. పోటీగా చిరంజీవి, రవితేజ లాంటి పెద్ద స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా వాల్తేరు వీరయ్య సినిమా వున్నా కూడా బాలయ్య ఈ సినిమాని ఒంటి చేత్తో నష్టాలు పాలు కాకుండా చేశాడు. పైగా సంక్రాంతి సీజన్ కూడా బాలయ్యకి కలిసి రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: