SSMB28: రికార్డు ధరకు అమ్ముడైన ఓటిటి రైట్స్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు.గతేడాది చేసిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేష్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న వస్తున్న మూడో మూవీ పై ఇప్పటికే అభిమానులకు చాలా భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అందుకున్నాయి. ఇప్పుడు ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్.. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కి్ల్లో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంది.


ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంక్రాంతి రోజే చాలా గ్రాండ్ గా ప్రకటించింది.ఈ సినిమా ఓటీటీ హక్కులను రికార్డు స్థాయిలో రూ. 80 కోట్లకు సొంతం చేసుకుందంటున్నారు. మహేష్ బాబుతోపాటు ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ కు కూడా ఇది తొలి భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ  సినిమాకు భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.ఈ మూవీ తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారు.ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజిలో చాలా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: